![]() |
Chinnapillala Kathalu |
రామాపురంలో ఉండే గోపాల్ చాలా అమాయకుడు వాడికి నా అనేవాళ్లెవరూ లేరు గ్రామస్థులంతా రోజుకొకరు చొప్పున గోపాల్కి అన్నం పెట్టేవారు అందరూ చిన్నచిన్న పనులు చెబుతుంటే చేస్తుండేవాడు కానీ గోపాల్ అమాయకుడని, ఇతరుల మాటలు నమ్మి సులువుగా మోసపోతాడని తెలిసి, అతనికి డబ్బుతో ముడిపడిన పనులేవీ చెప్పేవారు కాదు.
వూరికి కొత్తగా శంకరం మాష్టారు వచ్చారు ఆయనకో చిన్న కొడుకున్నాడు ఓ రోజు వాడు గుర్రం బొమ్మ కావాలని పేచీపెట్టసాగాడు అంతలో అటుగా వెళుతున్న గోపాల్ను పిలిచారు మాష్టారు వాడి అమాయకత్వం గురించి తెలియక యాభై రూపాయలిచ్చి గుర్రం బొమ్మ తెమ్మని చెప్పారు సరేనంటూ చేతిలో డబ్బులు పట్టుకుని హుషారుగా బయలుదేరాడు గోపాల్.
దారిలో ఒకతను గుమ్మడికాయలు అమ్ముతూ కనిపించాడు ఆయన దగ్గరికెళ్లి ఇక్కడ గుర్రం బొమ్మ ఎక్కడ దొరుకుతుంది అడిగాడు గోపాల్ ఏమో నాకు తెలీదు అని చెప్పాడు అతను తర్వాత గోపాల్ గుమ్మడికాయలను ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటివి ఇంత పెద్దగా ఉన్నాయ్ అడిగాడు వీడొట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడే ఇది కూడా తెలియదా, ఈ గుమ్మడికాయను వీడికి అమ్మాల్సిందే అని మనుసులో అనుకుని ఇవి గుర్రం గుడ్లు బాబూ కొన్ని రోజుల తర్వాత వీటి లోపలి నుంచి పిల్లలొస్తాయి అని చెప్పాడు.
దానికి గోపాల్ చాలా సంతోషించాడు మాస్టారు గుర్రం బొమ్మను తెమ్మన్నారు, కానీ ఏకంగా గుర్రం పిల్లనే తీసుకెళితే ఆయన నన్నెంతో మెచ్చుకుంటారు అని మనసులో అనుకుని దీని ధరెంత అడిగాడు గోపాల్ ఒక్క గుడ్డు యాభై రూపాయలు చెప్పాడతను గుమ్మడికాయను కొని తలపై పెట్టుకుని బయలుదేరాడు గోపాల్.
దారిలో ఒక మేక అడ్డమొచ్చి కిందపడ్డాడు గోపాల్ ఆ దెబ్బకి గుమ్మడికాయ రెండు ముక్కలైంది.
అక్కడే ఓ బుజ్జి మేకపిల్ల కూడా ఉంది అరె గుడ్డులో నుంచి అప్పుడే గుర్రం పిల్ల వచ్చేసిందే అనుకొని దాన్ని తీసుకెళ్లి మాష్టారుకిచ్చాడు అప్పటికే ఊరివాళ్ల ద్వారా గోపాల్ గురించి తెలిసిన మాష్టారు మారు మాట్లాడకుండా వాడిని సాగనంపారు ఆపై ఎవరూ వాడికి పనులు చెబితే ఒట్టు.
No comments:
Post a Comment