![]() |
Chinnapilla Kathalu |
ఒకసారి సనకసనందనులు అనే నల్గురు ఋషులు విష్ణువును దర్శించ టానికి వైకుంట మునకు పోతారు అక్కడ జయ,విజయులనేడి ద్వార పాలకులు వారిని లోనికి పోవడానికి అనుమతించరు వారు ఎన్ని విధాల చెప్పి చూసినా వారు లోనికి అనుంతించరు అప్ప ుడు వారికి కోపం వచ్చి మీరు భూలోకంలో మానవులుగా పుట్టుదురు గాక అని శాపం యిస్తారు అప్పుడే విష్ణువు బయటికి వచ్చి ఆ ఋషులను క్షమించ మని వేడి జయ విజయులను మందలిస్తాడు.
వారిచ్చిన శాపమును గురించి విని విష్ణువు జయవిజయుల తో యిలా చెప్తాడు మీరు భూలోకం లో మంచి వారుగా పుట్టి ఏడు జన్మల తర్వాత నన్ను చేరుకుంటారా లేక రాక్షసులై పుట్టి నన్ను ద్వేషిస్తూ మూడు జన్మల లో నా చేత
చంప బడి నన్ను చేరుకుంటారా మీకేది యిష్ట మో చెప్పండి అప్పుడు వారు స్వామీ మీకు దూరంగా ఏడు జన్మలు
వుండలేము రాక్షసులుగా పుట్టి మూడు జన్మ లలో మీ చేత చంపబడి మిమ్ములను చేరుకోవడమే మాకు యిష్టము అని చెప్తారు.
వారిద్దరూ మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా పుట్టి లోక కంటకులై అందరినీ బాధ పెడుతుంటారు.వరాహావతారము లో హిరణ్యాక్షుడినీ,నరసింహావతారం లో హిరణ్యకశిపు డినీ విష్ణువు సంహరిస్తాడు
రెండవ జన్మ లో రావణ,కుంభకర్ణులు గా పుట్టి లోక కంటకు లై చరిస్తూ వుంటారు అప్పుడు విష్ణువు శ్రీరాముడు గా పుట్టి వారిని సంహరిస్తాడు మూడవ జన్మ లో శిశుపాల, దంతావ క్త్రు లుగా పుడతారు.విష్ణువు శ్రీ కృష్ణుడు గా అవతరించి వారిద్దరినీ సంహరిస్తాడు శిశుపాలుడిని వంద తప్పుల వరకూ క్షమించి ధర్మరాజు చేసిన రాజసూయ యాగం లో శిశు పాలుడిని తన చక్రము తో సంహరిస్తాడు.
అప్ పుడే శిశుపాలుడి ఆత్మ ఆయనలో లీన మవుతుంది యిక దంతవక్త్రుడు వృద్ధ శర్ముకు,శ్రుత దేవకు పుట్టిన కొడుకు శ్రుతదేవ వసుదేవుడి చెల్లెలు శిశుపాలుడు యితడి అన్న ఇతను కరూష దేశానికి అధిపతి తన మిత్రులైన పౌండ్రక వాసుదేవాదులనుశ్రీకృష్ణుడు చంపడం వల్ల కృష్ణుడి మీద పగ పెంచుకుంటాడు తన మిత్రులకు ఉత్తర క్రియలు జరిపిస్తూ వుంటే అక్కడ కృష్ణుడిని చూసి అతనితో యుద్ధము చేసి కృష్ణుడి చేతిలో మరణిస్తాడు అతని తేజస్సు కృష్ణుడి లో ఐక్య మవుతుంది అలాగ జయ,విజయులు తిరిగి విష్ణువును చేరుకుంటారు.
No comments:
Post a Comment