![]() |
Chinnapillala Kathalu |
భాగవతం కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశము నందు జరిగినది కురుక్షేత్రం ఈనాటి
భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి.
కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించిన వర్ణన ఉంది భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది పాండవవీరుడైన అర్జునుని కోరికపై అతడి రధసారధి శ్రీకృష్ణుడు రధాన్ని రణభూమిలో మోహరించిన రెండుసైన్యాల మధ్యకు తెచ్చాడు.
అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు వారిని చూసి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు.
అలా అర్జునునికి అతని రథసారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
No comments:
Post a Comment