Thursday, 2 July 2015

పన్నెండు మంది శిష్యుల కథ

Chinnapillala Kathalu


గురువుగారు  పరమానందయ్యగరు వారి శిష్యులు మొత్తం పన్నెండు మంది.. తెలివితక్కువతనానికి, మూర్ఖత్వానికి పెటింది పేరు పేరు పరమానందయ్యగారి శిష్యులు ఆ పన్నెండు మంది శిష్యులు చేసే తెలివితక్కువ పనులు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి.. అసలు పరమానందయ్య గారి శిష్యుల గురించి కొంచం వివరంగా తెలుసుకుందాం.
*******                  ********                 **********                 ********                   *******
పూర్వం దేవలోకంలో పన్నెండుమంది మునీశ్వర్లు ఒక ఉద్యానవనంలోంచి వెళ్తున్నారు. ఆ వనం ఎంతో అందంగా ఉంది. మునులు ఉద్యానవనం అందచందాలను అస్వాదిస్తూ మెల్లగా మట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు వీరు వెళ్తున్న బాటనానుకొని దట్టమైన పూపొదలు ఉన్నాయి వాటి వెంకాలే స్వచ్ఛంగా మెరుస్తున్న నీటిలో రంగురంగుల పద్మాలు కలిగిన కొలను ఉంది ఆ సమయంలో ఆ కొలనులో ఒక అప్సరస జలకాలాడుతోంది అప్పుడు ఆమెకు ఈ మునుల మాటలు వినిపించి వారు తన సౌందర్యాన్ని రహస్యంగా చూస్తున్నారన్న అనుమానంతో మీరంతా వట్టి బుద్ధి హీనులు కండి అని శాపం ఇచ్చింది.

వారి వెనుకగా వస్తున్న తాపసి ఇది గమనించాడు మునులు మాకే పాపమూ తెలిదు మేము నీ సౌందర్యాన్ని చూడడంలేదని అని మొరపెట్టుకొన్నారు తాపసికి అప్సరస తొందరపాటు కోపం వచ్చి నువ్వు ముందూ వెనుకా చూడకుండా తొందరపాటుతో మునులని శపించావు కనుక నువ్వూ వారితో పాటు భూలోకమొలో జన్మించు అని ఆమెను శపించాడు భూలోకంలో శివభక్తుడైన మహరాజు ఉంటాడు ఈ అప్సర అతనికి వేశ్యగా ఉంటుంది ఆ రాజుకు అభిమానుడయిన ఓ పండితుడు మఠం కట్టుకొని నివసిస్తూ ఉంటాడు అతను మహా పండితుడు ఆయన వద్ద ఈ పన్నెండు మంది మునులు తెలివితక్కువ శిష్యులుగా చేరుతారు.

రాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం చేస్తుంటాడు ఆ మహాపండితుడే ప్రమానందయ్యగారు వారికి శిష్యులంటే వల్లమాలిన ప్రేమ, ఎక్కడలేని వాత్సల్యమూ, శిష్యులెంత తెలివితక్కువగా ప్రవర్తించినా, థం తెలివితక్కువతనం వల్ల గురువుగారికి ఎన్ని విధాల బాధలు కలిగించినా ఆ గురువుగారికి శిష్యుల మీద ఎంతమాత్రమూ కోపం వచ్చేది కాదు.

పరమానందయ్య గారు గొప్ప పండితులు. పురాణాలు, హరి కథలు చెప్పడంలో దిట్ట ఆయనకు రాజాశ్రమముంది పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.



No comments:

Post a Comment