Monday, 7 September 2015

పరివర్తన

Chinnapillala Kathalu
అనగనగా ఒక ఊరిలో శేష అనే దొంగ ఉండే వాడు. అతను ఒక రోజు అర్ధరాత్రి దొంగతనానికి రాజమందిరానికి వెళ్లాడు. కాపలాగా ఉన్న సైని కుల కళ్ల కప్పి అంతఃపురానికి చేరుకున్నాడు. ఆ సమయంలో రాజు, రాణి నిద్రపోకుండా మాట్లాడుకుంటున్నారు. శేషుకి వాళ్లు ఏం మాట్లాడుకుంటు న్నారో వినాలనే కుతూహలం కలిగింది. "మహారాజా! మన కుమార్తె వివాహం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి" అని మహారాణి అడిగింది. "మహారాణీ! నదికి అవతల ఉండే ఊరిలో కొంత మంది పుణ్యపరుషులు ఉన్నా రనే సంగతి మీకు తెలుసు కదా! వారు రేపు మన ఆస్థానానికి వస్తున్నారు. వారిలో ఒకరికి మన ఆ యినిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది కదా" అన్నాడు రాజు. అప్పడు రాణి, "చాలా దివ్యంగా ఉంటుంది మహారాజా' అంది.

ఇదంతా చాటునుంచి వింటున్న శేష, "నేను కూడా వారితో కలిసిపోయి రేపు వస్తే చాలా బాగుంటుంది' అనుకు న్నాడు. అనుకున్నట్లే మరుసటి రోజు పుణ్యపరుషులతో కలిసి ఆస్థానానికి ാഠ దుగా మంత్రి వచ్చి "యువరా ణిని పెళ్లిచేసుకోవటం సమ్మత మేనా?” అని అక్కడ ఉన్న ఒక్కొక్కరినీ విడివిడిగా అడి గాడు. అందరూ తమ ఆశయా లకి వివాహం వల్ల ఆటంకం కలుగుతుంది, కాబట్టి వివాహం చేసుకోలేమని చెప్పారు. శేషు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అప్పడు మంత్రి రాజు దగ్గరకు వెళ్లి "మహారాజా! వారిలో ఒక్కరిని మాత్రమే మనం వివాహానికి ఒప్పించగలం' అని చెప్పాడు.

అప్పడు మహారాజే స్వయంగా శేష దగ్గరకు “మహానుభావా! మీలాంటి వారితోనే మా కుమార్తె వివాహం జరిపించాలని మా కోరిక. దయచేసి ఈ వివా హానికి అంగీకరించండి" అని కోరాడు. మహారాజు చూపిస్తున్న మర్యాద శేషుకి ఆనందాన్ని కలిగించింది. "మంచివాడిగా నటిస్తేనే ఇంత ఆనందంగా ఉంది. నిజంగా మంచివాడిగా మారితే ఎంత బాగుంటుందో అనుకు న్నాడు. ఆ క్షణం నుంచే శేషులో పరివర్తన ప్రారంభమయింది. మోసం చేసి యువరాణిని పెళ్లి చేసుకోవడం చాలా తప్ప' అని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తరవాత దొంగతనాలు మానేసి ప్రజలందరికీ ఉపయోగ పడే మంచిపనులు చేయటం ప్రారంభించాడు. అనతికాలంలోనే ఆ ప్రాంతంలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు.

ప్రాణానికి ప్రాణం

Chinnapillala Kathalu
ఒకసారి మర్యాదరామన్న న్యాయస్థానానికి న్యాయం కోసం రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సోమయ్య తన చేతి సంచిలోంచి ఒక పామును బయటికి తీశాడు. ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది. "అయ్యా రామన్నగారూ, చూడండి నా పామును ఇతడెలా భయంకరంగా చంపేశాడో. ఇది ఇతనికి ఏ హానీ చేయలేదు. కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపాడు' అంటూ కోపంగా సోమయ్య "అతను చెప్పింది నిజమే ప్రభూ! అదొక విషప్రాణి, చచ్చిపోయినా కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి. సోమయ్య దాన్ని స్వేచ్ఛగా బయటికి వదిలేశాడు. అది నన్నేం చేయలేదు. కాని ఎవరైనా పొరపాటుగా దాని దగ్గరకు వెళితే అది కాటేయక మానదు. అందుకే దాన్ని చంపేశాను.

అందరి మంచి కోసం చేసిన ఈ పని నేరమైతే నన్ను శిక్షిం చండి" అని వినయంగా చెప్పాడు రామయ్య "పాము ప్రమాదకరమైనది. సహజంగా మనుషులు దాన్ని చంపాలనే చూస్తారు. బయటికి రాకుండా నీ పామును నువ్వ జాగ్రత్తగా కాపాడు కోవాల్సింది" అంటూ మర్యాదరామన్న సోమయ్యకి సర్దిచెప్పబోయాడు. మర్యాదరామన్న మాటను ఏ మాత్రం వినిపించుకోకుండా "కంటికి కన్ను పంటికి పన్నే సరైన న్యాయమని నేను నమ్ముతాను. నా పాము ప్రాణాలకు బదులు ఇతని ప్రాణాలు తీ ందే. నేరస్తులను మీరు శిక్షిం చకపోతే రాజ్యంలో ఘోరాలు ఇలాగే పెచ్చుపెరిగిపోతాయి. నేను ఇతణ్ణి వదలను. నా పామును ఏ విధంగా చంపాడో ఇతన్ని కూడా అదే విధంగా చంపుతాను" అన్నాడు అవేశంగా సోమయ్య సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న మర్యాదరామన్నకు ఒక ఆలోచన తట్టింది. "నీ పామును రామయ్య ఎలా చంపాడు?" అని అడిగాడు రామన్న "ఎలా చెప్పమంటారు? దాని తోక పట్టుకుని గిరగిరా గాల్లో తిప్పి నేలకేసి విసిరి కొట్టాడు." అని చెప్పాడు సోమన్న 'సరే, నువ్వ కూడా అలాగే చంపు. అతని తోక పట్టుకుని గాల్లోకి లేపి గిర గిరా నెలకేసి కొట్ట' అని తీర్పు చెప్పాడు. సోమయ్య అయోమయంలో పడ్డాడు. "మనిషికి తోక ఉంటుందా? ఆ తోక పట్టుకుని గాల్లో తిప్పి చంపడం సాధ్యమేనా? ఇదసలు కుదిరే పని కాదు" అన్నాడు.
అప్పుడు న్యాయాధికారి శాంతంగా "ఔను నిజమే. మనిషికి తోక ఉండదు. అతన్ని పాములా చంపలేం. కాబట్టి నువ్వ § ఫిర్యాదును వెనుకకు తీసుకుని ఇంటికి వెళ్ళిపో" అని తీర్చు చెప్పాడు. మర్యాదరామన్న ఇచ్చిన తీర్పుకి ఏం చేయాలో పాలుపోక తన తప్ప తెలుసుకుని తల వంచుకుని ఇంటికి వెళ్లిపోయాడు సోమయ్య.